Banswada News
రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే.
Quick Summary:
గురుపౌర్ణమి వేడుకల్లో రంగుల సందడి.
మోసిన్ 5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని పీపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో గురుపౌర్ణమి సందర్భంగా బ్లూ కలర్ డే కార్యక్రమాన్ని ప్రీప్రైమరీ విద్యార్థులతో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులకు రంగుల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు, వివిధ రంగులను గుర్తించేలా చేయడం, చిన్ననాటి నుంచే వారిలో పరిశీలనాత్మక ధోరణిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు నీలిరంగు దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తరగతి గదులను నీలిరంగు బొమ్మలు, అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. రంగులపై అవగాహన కల్పిస్తూ చిన్నారులతో పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజాబాబు, ఉపాధ్యాయులు, ఎల్.పీ.ఈటీ రంజిత్, రాజు, సునంద, నవిత, స్వప్న, శ్వేత, రుక్మిణి, రూప తదితరులు పాల్గొన్నారు.